ఘోర రోడ్డు ప్రమాదం.. యువతి దుర్మరణం

28 Jan, 2020 11:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యవతి దుర్మరణం పాలైంది. వివరాలు... సాయిదీపికా రెడ్డి అనే యువతి ఓ రియల్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా మంగళవారం యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్‌గూడకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టింది.

ఈ ఘటనలో సాయిదీపిక అక్కడిక్కడే మృతి చెందింది. కాగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఇక ప్రమాదానికి కారణమైన బస్సు కొండాపూర్‌ డిపోనకు చెందినదిగా తెలుస్తోంది. ఘటనకు కారణమైన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు