భర్తతో కలిసి గుళ్లోనే ప్రియుడి చంపేసింది

28 Sep, 2017 15:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భార్య మరోకరితో సంబంధం కొనసాగించటం భర్తకు తెలిసిపోయింది. ముందు తప్పును అంగీకరించని ఆమె తర్వాత ఒప్పేసుకుంది. అయితే ఆ తర్వాతే ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ప్రియుడిని తన దగ్గరికి రప్పించుకుని పూజారి భర్తతో కలిసి హతమార్చింది. ఆపై ఏమీ ఎరగనట్లు శవాన్ని గుళ్లోనే తగలబెట్టగా.. పోలీసులు కేసు మిస్టరీని చేధించారు. 

ఢిల్లీలోని గాంధీనగర్‌ పురాతన శివాలయంలో పూజారిగా లఖన్‌ దుబే పనిచేస్తున్నాడు . అతనికి తొమ్మిదేళ్ల క్రితం మధురకు చెందిన మహిళతో వివాహం అయ్యింది. కాగా, అప్పటి నుంచి ఆమె తన స్వగ్రామంలోనే ఉండగా, దుబే మాత్రం ఢిల్లీలో ఒంటరిగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన చంద్ర శేఖర్‌ అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. రెండు నెలల క్రితం భార్యను తన దగ్గరికి తెచ్చేసుకున్న భర్తకు అనుమానం రావటంతో ప్రశ్నించగా.. ముందు బుకాయించింది. చివరకు తప్పు ఒప్పుకుని ఆ ప్రేమికుడిని చంపేందుకు భర్తతో ఫ్లాన్‌ ఓ వేసింది. 

తన భర్త ఇంట్లో లేడని చెప్పి ట్రాప్‌ చేసి చంద్రశేఖర్‌ను ఢిల్లీకి రప్పించింది.  ఆపై అతనికి నిద్రమాత్రలు ఇవ్వగా.. స్పృహ కోల్పోయిన అతన్ని ఆ భార్యాభర్తలు దారుణంగా హతమార్చారు. ఇక ప్రతికూల పరిస్థితులు ఉండటంతో శవాన్ని గుడి పైనే శవాన్ని ఉంచి తర్వాత మాయం చేయాలనుకున్నారు. అయితే శవం క్రమంగా కుళ్లిపోతుండటంతో చేసేది లేక బుధవారం ఉదయం కాల్చేశారు. గుడి పై నుంచి పొగలు రావటం.. అది కూడా ఏదో మాంసం ముద్దలు కాలినట్లు వాసన రావటం గుర్తించిన స్థానికుడొకరు పోలీసులకు సమాచారం అందించగా వారొచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమకేం సంబంధం లేనట్లు ఆ జంట నటించగా.. వారిద్దరి కదలికలు అనుమానంగా కనిపించటం.. పైగా గుడి పైకి వచ్చే మార్గంలోకి వాళ్లకు మాత్రమే వచ్చే వీలుండటంతో పోలీసులు గట్టిగా ప్రశ్నించారు. దీంతో జరిగిందంతా వెలుగులోకి వచ్చింది. వాళ్లు నేరాన్ని అంగీకరించటంతో అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు షాదారా డీసీపీ నుపుర్‌ ప్రసాద్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు