మహిళ అనుమానాస్పద మృతి

8 Jun, 2019 07:42 IST|Sakshi
సయ్యద్‌ సబా (ఫైల్‌)

బహదూర్‌పురా: మతిస్థిమితం లేని ఓ మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సంఘటన బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌కు చెందిన సయ్యద్‌ సబా (42)కు మతిస్థిమితం సరిగా లేదు. గత కొన్నేళ్లుగా ఆమె  ఓల్డేజ్‌ హోమ్‌లో ఉంటోంది. గురువారం రాత్రి ఆమె హోమ్‌లోని రెండో అంతస్తులో ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని  నిప్పంటించుకుంది. దీనిని గుర్తించిన హోమ్‌ నిర్వాహకులు  పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. లోపలికి వెళ్లి చూడా సయ్యద్‌ సబా పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.హోమ్‌ అకౌంటెంట్‌ ఫిర్యాదు మేరకు ఎస్సై శివకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు