తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి వైభవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లనుంది. శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్ ప్రసారాలు శనివారం నుంచి యూట్యూబ్లో ప్రసారం కానున్నాయని ఎస్వీబీసీ సీఈవో మధుసూదన్ రావు గురువారం ప్రకటించారు. ఇప్పటికే ఆ సంస్థతో టీటీడీ యాజమాన్యం చర్చలు సఫలమయ్యాయి.
చానల్ ప్రసారం ద్వారా వచ్చే వ్యాపార ప్రకటనల్లో సగభాగాన్ని టీటీడీకి అందించేందుకు యూట్యూబ్ యాజమాన్యం అంగీకరించింది. వీటికి సంబంధించిన అగ్రిమెంట్లు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మొబైల్ యాప్స్లో కూడా చానల్ ప్రసారాలు డౌన్లోడ్ చేసుకునేందుకు సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నారు.