త్వరలోనే నా వందో చిత్రం: బాలకృష్ణ

23 Jan, 2016 09:48 IST|Sakshi
త్వరలోనే నా వందో చిత్రం: బాలకృష్ణ

కంబాలచెరువు : డిక్టేటర్ చిత్ర విజయయాత్రలో భాగంగా శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరంలోని అనుశ్రీ సినిమాస్ థియేటర్‌కు ఆ చిత్రం హీరో నందమూరి బాలకృష్ణ వచ్చారు. చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు అభినందనలు తెలిపారు. త్వరలోనే తన వందో సినిమా ఉంటుందన్నారు. అనంతరం ఆ సినిమాలోని డైలాగులతో సందడి చేశారు. హైదరాబాద్‌లో మాదిరిగానే ఉభయగోదావరి, కృష్ణాజిల్లావాసుల కోసం బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని బాలకృష్ణను ఎంపీ మురళీమోహన్ కోరారు.
 
వైజాగ్ నుంచి రోడ్డుమార్గంలో వస్తున్న బాలకృష్ణ ముందుగా తలుపులమ్మ లోవలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ చిత్ర దర్శకులు శ్రీవాస్, సినీనటుడు పృథ్వీరాజ్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పెందుర్తి వెంకటేష్, అనుశ్రీ సినిమాస్ అధినేత సత్యనారాయణ, చిత్ర పంపిణీదారులు చల్లా శంకర్రావు ఉన్నారు.

మరిన్ని వార్తలు