చిత్తూరు : చిత్తూరు జిల్లా కల్లూరు ఘాట్ రోడ్డుపై శనివారం బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్మార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు జైపాల్, ముఖేష్, మహేష్లుగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.