పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి

14 Sep, 2016 08:35 IST|Sakshi
పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి

హైదరాబాద్‌ : పిడుగుపాటుకు 20 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన హయత్‌నగర్ మండలం కోహెడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో తనకు  రూ.5 లక్షల నష్టం జరిగిందని గొర్రెల యజమాని కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

మరిన్ని వార్తలు