మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం షేర్పల్లి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఆదిత్య ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 24 మందికి గాయాలు అయ్యాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.