246 కిలోల గంజాయి పట్టివేత

6 Aug, 2016 13:02 IST|Sakshi

విశాఖపట్టణం: విశాఖపట్నం జిల్లాలో చోడవరం వద్ద ఎక్సైజ్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో అక్రమంగా తరలిస్తున్న 246 కిలోల గంజాయిని వారు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు