కుర్ర హీరోలతో పూరి మల్టీ స్టారర్ | Sakshi
Sakshi News home page

కుర్ర హీరోలతో పూరి మల్టీ స్టారర్

Published Sat, Aug 6 2016 1:08 PM

కుర్ర హీరోలతో పూరి మల్టీ స్టారర్ - Sakshi

జెట్ స్పీడుతో సినిమాలు చేసే దర్శకుడు పూరి జగన్నాథ్.. మరో క్రేజీ ప్రాజెక్ట్కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఇజం సినిమాను తెరకెక్కిస్తున్న పూరి, ఆ తరువాత మహేష్ బాబుతో జనగణమన సినిమా చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ కూడా పూరి జగన్నాథ్తో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇలా స్టార్ హీరోలతో సినిమాలు ఉన్నా.. ఈ గ్యాప్లో ఓ చిన్న సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు పూరి.

ఒక్క అమ్మాయి కోసం పోటి పడే ఇద్దరు అబ్బాయిల కథగా ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించనున్నాడు. యంగ్ జనరేషన్ మల్టీ స్టారర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్యతో పాటు పెళ్లిచూపులు ఫేం విజయ్ దేవరకొండలను హీరోలుగా ఫైనల్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.

Advertisement
Advertisement