'పుష్కరాలకు 31,400 మంది పోలీసులతో భద్రత'

9 Aug, 2016 18:30 IST|Sakshi

విజయవాడ: కృష్ణా పుష్కరాలకు 31, 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. ఇందులో భాగంగా 30 మంది ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపారు. విజయవాడలో రూ. 20 కోట్లతో కమాండ్ కంట్రోల్.. 1300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

చెన్నై- కోల్కతా- హైదరాబాద్ జాతీయ రహదార్లపై ట్రాఫిక్ పర్యవేక్షణ బాధ్యతలు ఐజీలు రామకృష్ణ, సంజయ్ జైన్కు అప్పగించినట్టు తెలిపారు. విజయవాడలో భక్తుల కోసం 65 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. విజయవాడ, గుంటూరులో 740 ఉచిత బస్సులును ఏర్పాటుచేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు