ఐఏఎస్‌ పరీక్షపై అవగాహన సదస్సు నేడు

2 Sep, 2016 21:19 IST|Sakshi
 
విజయవాడ (సత్యానారాయణపురం) : 
ఇండియన్‌ అడ్మినిస్ట్రేషన్‌ సర్వీస్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు చిత్తరంజన్‌ శాఖా గ్రంథాలయం అధికారిణి కోగంటి పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  స్థానిక గ్రంథాలయంలో నిర్వహించే కార్యక్రమానికి ఢిల్లీలోని ఐఏఎస్‌ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు, అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ ప్రొఫెసర్‌ ఎం.శ్రీనివాసరావు పాల్గొంటారని చెప్పారు.
 
మరిన్ని వార్తలు