బాలయ్య పీఏ అవినీతి.. కరపత్రాలు విడుదల

17 Aug, 2015 22:35 IST|Sakshi

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ.. కరపత్రాల పంపిణీ జరిగింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో ఉంచడంతో.. ఈ వార్త ధావనంలా పాకింది. కరపత్రంలో తెలిపిన వివరాల ప్రకారం ‘‘ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఎందరో మహానుభావులు విజయం సాధించారు.

అయితే వారు చేయని పనిని ఘన కీర్తి సాధించిన ప్రస్తుతం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసి చూపిస్తున్నాడని తెలిపారు. ఎన్టీఆర్‌పై మమకారంతో ఓట్లు వేసి గెలిపించిన హిందూపురం ప్రజలైతే ఇక్కడ ప్రజల అభిమానాన్ని నోట్ల రూపంలో అతని ఇన్‌చార్జ్ శేఖర్ ప్రజల నుంచి వసూలు చేస్తాన్నాడని’’ అందులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు