వెల్దుర్తి: మండల కేంద్రమైన వెల్దుర్తిలోని శేరివాడలో గల ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది సెప్టెంబర్ 3న హరితహారంలో భాగంగా ఎమ్మెల్యే మదన్రెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటారు. పాఠశాల హెచ్ఎం అరికెల వెంకటేశ్, ఉపాద్యాయులు, విద్యార్థులు మొక్కలను పెంచి పెద్ద చేశారు.
శనివారం ఎంపీపీ సునితా ప్రతాప్రెడ్డి, సర్పంచ్ మోహన్రెడ్డి, మెదక్ మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ క్రిష్ణాగౌడ్, ఎంఈఓ యాదగిరి, ఉప సర్పంచ్ కర్రె వెంకటేశ్, ఎస్ఐ నాగరాజు, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, యాదవ యువజన సంఘం సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు మొక్కల పుట్టినరోజు పండుగను ఘనంగా నిర్వహించారు.
సరిగ్గా శనివారం నాటికి ఏడాది పూర్తి కావడంతో మొక్కల పుట్టిన రోజును అంగరంగవైభవంగా నిర్వహించారు. కేకులు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ప్రతి మొక్కకు రంగురంగుల గాలి బెలూన్లను కట్టారు. మొక్కలను పెంచుతున్న వారిని పలువురు అభినందించారు.