పెళ్లి పీటల నుంచి టెట్‌కు నవ వధువు

23 May, 2016 14:55 IST|Sakshi
పరీక్ష హాల్‌లో అర్చన

నిర్మల్ టౌన్ : ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు నవ వధువు హాజరైంది. జైనూర్‌కు చెందిన అర్చనకు కిషోర్‌తో ఆదివారం ఉదయం 11 గంటలకు పెళ్లి జరిగింది.

వివాహం పూర్తయిన వెంటనే రెండో పేపర్ పరీక్ష రాయడానికి మధ్యాహ్నం నిర్మల్‌కు బయలుదేరి వచ్చింది. పెళ్లి పందిరి నుంచి పెళ్లి బట్టలతో నేరుగా పరీక్షకు హాజరైంది. ఆమె పరీక్ష రాయడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. టెట్ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కనుక పెళ్లికాగానే వ చ్చి పరీక్షరాయాల్సి వచ్చిందని నూతనవధువు అర్చన తెలిపారు.

మరిన్ని వార్తలు