పందుల దాడిలో చిన్నారికి గాయాలు

11 May, 2017 23:57 IST|Sakshi
కౌతాళం : కౌతాళానికి చెందిన నరసయ్య, ఎలమ్మ దంపతుల కుమారుడు చరణ్‌ (3) పందుల దాడిలో  గాయపడ్డాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు ఇంటి పనిలో నిమగ్నం కాగా,  ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై పందులు దాడి చేశాయి. గాయపడిన బాలుడిని స్థానిక పీహెచ్‌సీలో ప్రాథమిక చేయించి ఆదోనికి తరలించారు. కౌతాళంలో పందుల బెడద అధికంగా ఉందని ఫిర్యాదు చేసినా పంచాయతీ సిబ్బంది, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా కాలనీవాసులు విమర్శిస్తున్నారు.   
 
మరిన్ని వార్తలు