విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు

4 Mar, 2017 22:40 IST|Sakshi

కళ్యాణదుర్గం : పట్టణంలోని జ్ఞానభారతి ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న జశ్వంత్‌ అనే విద్యార్థి తప్పిపోయినట్లు తండ్రి లక్ష్మణమూర్తి శనివారం పట్టణ పోలీస్టేన్‌లో ఫిర్యాదు చేశారు. గత బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పాఠశాల ప్రహరీ దూకి వెళ్లిపోయినట్లు అక్కడి వార్డెన్‌ తిప్పేస్వామి సమాచారం ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణదుర్గం ప్రాంతంలో అన్వేషించినా ఆచూకీ లభించలేదన్నారు. తన కుమారుని అచూకీ కనుగొని న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు