'పువ్వాడ అజయ్వి తప్పుడు ఆరోపణలు'

25 Apr, 2016 14:21 IST|Sakshi

హైదరాబాద్: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, మరోనేత ఫాయాక్ హుస్సేన్లు స్వార్ధ అవసరాల కోసం టీఆర్ఎస్లో చేరుతున్నారని కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, నిరంజన్లు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో తమకు ప్రాధాన్యత, గుర్తింపు లేవంటూ అజయ్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఆ ఇద్దరు నేతలకు కాంగ్రెస్ తక్కువేమీ చేయలేదని తెలిపారు.

తీవ్రకరువుతో అలమటిస్తున్న ప్రజలను ఆదుకోవాల్సిన సీఎం కేసీఆర్ తన బాధ్యతను విస్మరించి ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదన్నారు. కరువు సహాయక చర్యల్లో టీఆర్ఎస్ విఫలమైన తీరుకు నిరసనగా ఈ నెల 27న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
 

మరిన్ని వార్తలు