ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ప్రజా బ్యాలెట్

18 Nov, 2016 17:31 IST|Sakshi

విజయవాడ: ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రజా బ్యాలెట్ నిర్వహించింది. ఈ కార్యక్రమం ఎస్‌ఆర్‌ఆర్, సీవీఆర్ కాలేజీలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్లాది విష్ణు, సుంకర పద్మ శ్రీ మాట్లాడారు. ప్రత్యేక హోదాతోనే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని అని అన్నారు.

హోదాను చెల్లని నోట్‌తో టీడీపీ నాయకులు పోల్చడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. టీడీపీ, బీజేపీ చేసిన మోసాలను ప్రజా కోర్టులో తేలుస్తామన్నారు. ఇద్దరు నాయుళ్లు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు. హోదాపై మోసం చేసిన రెండు పార్టీలకు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.
 

>
మరిన్ని వార్తలు