శ్రీవారి సేవలో సీపీఐ నారాయణ

13 Nov, 2016 11:04 IST|Sakshi
శ్రీవారి సేవలో సీపీఐ నారాయణ

తిరుమల: ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సీపీఐ నాయకుడు నారాయణ ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపం వద్ద స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.

ఆలయ వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల కోరిక మేరకే శ్రీవారిని దర్శించుకున్నానని.. గతంలో చాలా సార్లు తిరుమలకు వచ్చినా.. వెంకటేశ్వరుడిని దర్శించుకోలేదని అన్నారు. కానీ ఈ సారి మాత్రం కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో తప్పలేదన్నారు. శ్రీవారికి బడాబాబులు సమర్పించే నగదు, నగలు అన్నీ బ్లాక్‌మనీనేనని ఆయన అన్నారు. పెద్దలంతా తమ డబ్బును ఎప్పుడో మార్చుకున్నారని.. సామాన్యుల మాత్రమే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
 

మరిన్ని వార్తలు