'తెలంగాణలో తప్పు...ఆంధ్రాలో ఒప్పా బాబూ'

21 May, 2016 20:47 IST|Sakshi
'తెలంగాణలో తప్పు...ఆంధ్రాలో ఒప్పా బాబూ'

విజయనగరం: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు తప్పని చెప్తున్న సీఎం చంద్రబాబు ఏపీలో పార్టీ ఫిరాయింపులు చేస్తే ఒప్పా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. విజయనగరంలో జరుగుతున్న మూడో గిరిజన మహసభలకు శనివారం ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..పార్టీ ఫిరాయింపులు హైదరాబాద్లో తప్పని చెప్పుతున్న బాబు...విజయవాడకు వచ్చి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు పచ్చ కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. పార్టీ మారిన వారికి రూ.5కోట్లు ఇస్తూ.. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు ఇస్తామంటూ బాబు హామీలు ఇస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజు జంప్ జిలానీ అయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఈ నెల 25న రాజధాని అమరావతిలో ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. అమరావతిని ఫ్రీజోన్గా ప్రకటించాలని రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు