దసరా హుండీ ఆదాయం రూ.1.37 కోట్లు

14 Oct, 2016 20:44 IST|Sakshi
దసరా హుండీ ఆదాయం రూ.1.37 కోట్లు
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, మొక్కుబడుల లెక్కింపు శుక్రవారం ప్రారంభమైంది. తొలి విడతగా ఆలయ ప్రాంగణంలోని క్లాత్‌ హుండీల ద్వారా వచ్చిన కానుకలను లెక్కించగా, 1,37,38,016 నగదు లభ్యమైంది. మొత్తం 80 మూటలతో కానుకలను మహామండపంలోని ఒకటో అంతస్తుకు తరలించి లెక్కించారు. లెక్కింపులో 270 గ్రాముల బంగారం, 4.400 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. శనివారం కూడా కానుకల లెక్కింపు జరుగుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 
 
 
 
 
 
 
>
మరిన్ని వార్తలు