వైభవంగా దత్తాత్రేయ జయంతి

13 Dec, 2016 23:29 IST|Sakshi
పిఠాపురం : 
పాదగయ క్షేత్రంలో మంగళవారం దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులతో క్షేత్రం కిటకిటలాడింది. దత్త దీక్ష చేపట్టిన స్వాములు ఇరుముడులు సమర్పించారు. మహాన్యాస పూర్వక శత రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన, హోమం నిర్వహించారు. పలువురు దంపతులు సామూహిక దత్త సత్య వ్రతాలు చేశారు. స్వామివారికి పల్లకీ సేవ వైభవోపేతంగా సాగింది. ఆలయ ఈఓ చందక దారబాబు, దత్తాత్రేయస్వామి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు వాడ్రేవు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు