జాతీయస్థాయి సైక్లింగ్‌ పోటీలకు దేశాయిపేట విద్యార్థిని

1 Oct, 2016 01:39 IST|Sakshi
వరంగల్‌ : మహారాష్ట్రలోని పూనెలో ఈనెల 3నుంచి జరిగే జాతీయ స్థాయి సైక్లింగ్‌ పోటీల్లో పాల్గొనేందుకు దేశాయిపేట ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని చైతన్య ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయుడు లోకనాథం తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన చైతన్య జాతీయ పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. పీఈటీ నిశాంత్‌ ఆధ్వర్యంలో చైతన్య శిక్షణ పొందిందని తెలిపారు. జాతీయ పోటీలకు వెళ్తున్న చైతన్యకు పాఠశాలలోని మ్యాథ్స్‌ టీచర్‌ రాధిక తల్లి జానకి చేతులమీదుగా స్పోర్ట్‌్సగేర్‌ సైకిల్‌ అందజేశారు. 
మరిన్ని వార్తలు