దేవాదుల పైప్‌లైన్ లీకేజీ

4 Sep, 2016 12:28 IST|Sakshi

ములుగు(వరంగల్): దేవాదుల మొదటి దశ పైప్‌లైన్ ఎయిర్ వాల్వ్ ను రైతులు ధ్వంసం చేశారు. వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం నల్లగుంట వద్ద దేవాదుల గేట్‌వాల్‌ను శనివారం అర్ధరాత్రి సమీప గ్రామాల రైతులు లీక్ చేశారు. దీంతో పైప్‌లైన్ ఎయిర్‌వాల్వ్ ద్వారా భారీగా నీరు ఎగజిమ్ముతోంది. వృథాగా పోతున్న నీటిని సమీపంలోని ఆరెకుంటలోకి మళ్లించడంతో అది నిండిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు మరమ్మత్తులు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు