తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఏడుకొండల వాడి దర్శనానికి ప్రస్తుతం 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న(ఆదివారం)స్వామివారిని 86,622 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.