జిల్లాస్థాయి త్రోబాల్‌ క్రీడాకారుల ఎంపిక

11 Aug, 2016 19:23 IST|Sakshi
జిల్లాస్థాయి త్రోబాల్‌ క్రీడాకారుల ఎంపిక

కీసర: నాగారం గ్రామంలోని విజ్ఞాన్‌ బోట్రి పాఠశాల ఆవరణలో గురువారం జిల్లా త్రోబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కొమ్ము వెంకట్‌ ఆద్వర్యంలో జిల్లా త్రోబాల్‌ క్రీడాకారుల ఎంపికను నిర్వహించారు. పురుషుల విభాగంలో కెప్టెన్‌గా నిఖిల్‌, వైస్‌ కెప్టెన్‌గా హరీష్‌, సభ్యులుగా దుర్గా, సాయిజేత, రాకేష్‌, వంశి, జీవన్‌, హరికృష్ణ, భార్గవ్‌, సాయి, కీర్తిరామ్‌, నితిన్‌, భార్గవ్‌, బిము, సాయిచరణ్‌, కోచ్‌లుగా నానాజీ, మనేందర్‌, సుభాన్‌లు ఎంపికయ్యారు.

మహిళల విభాగం
కెప్టెన్‌గా దీపిక, వైస్‌ కెప్టెన్‌గా అనిశా, సభ్యులుగా శ్రీలత, మమత, శ్రీలేఖ, శృతి, సరిత, రజిని, హేమ, శ్వేత, హర్షిత, రేవతి,  మేద, శృతి, కోచ్‌లుగా జాన్‌రెడ్డి, మనేందర్‌లు ఎంపికయ్యారు. కాగా  నేటినుంచి నగరంలోని అల్వాల్‌లో జరిగే రాష్ర్ట స్థాయి త్రోబాల్‌ పోటీల్లో జిల్లా తరపున  ఈ రెండు జట్లు పాల్గొననున్నట్లు జిల్లా త్రోబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కొమ్ము వెంకట్‌ తెలిపారు. క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో విజ్ఞాన్‌ బోట్రి పాఠశాల ఏఓ నాగేంద్ర, ప్రిన్సిపాల్‌ కవిత, సెలక్షన్స్‌ కమిటీ చైర్మన్‌ రేవంత్‌, పాఠశాల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు