మంత్రి పర్యటనకు గైర్హాజరు.. అధికారిని సస్పెండ్

12 Dec, 2016 14:32 IST|Sakshi

అశ్వరావుపేట(ఖమ్మం): రాష్ట్ర మంత్రి పర్యటనకు హాజరుకాని ప్రభుత్వ అధికారినిపై సస్పెన్షన్ వేటు పడింది. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పర్యటించారు. ఈ పర్యటనకు ఐసీడీఎస్ సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్న అన్నపూర్ణ అనే ఉద్యోగిని గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహించిన మంత్రి సీడీపీఓను సస్పెండ్ చేయాలని కలెక్టర్ రాజీవ్‌కు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు