వీణవంక బాధితురాలికి పరామర్శ

2 Mar, 2016 16:05 IST|Sakshi

కరీంనగర్: వీణవంక మండలం చల్లూరులో గ్యాంగ్రేప్కు గురైన బాధితురాలిని బుధవారం మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద పరామర్శిచారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ.. ఈ ఘటనపై మహిళా కమిషన్కు ఈ నెల 5న ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఓ దళిత యువతిపై ముగ్గురు యువకులు పైశాచికంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టించిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు