క్రీడల్లో రాణించాలి

3 Sep, 2016 22:08 IST|Sakshi
క్రీడల్లో రాణించాలి
పెద్దవూర: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కర్నాటి లింగారెడ్డి అన్నారు. శనివారం స్థానిక న్యూవిజన్‌ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన జూనియర్‌ కళాశాలల జిల్లా స్థాయి అండర్‌–19 వాలీబాల్‌ సెలక్షన్‌ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గెలిచే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుందని, దానిని ఎవరైతే పూర్తిగా అందుకుంటారో వారే జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వస్తపురి మల్లిక, ఎంపీడీఓ రఫీఖున్నీసా, ఎంఈఓ బి.ప్రభాకర్‌రావు, ఎస్‌ఐ బాడాన ప్రసాదరావు, నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ మందడి నర్సిరెడ్డి, వాలీబాల్‌ అండర్‌–19 ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జి. దయాకర్‌రెడ్డి, పీడీలు ఎస్‌. నర్సింహారెడ్డి, భాస్కర్‌రెడ్డి, భీకునాయక్, అబ్బాస్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ షేక్‌ అబ్బాస్, ప్రిన్సిపాల్‌ యాదగిరి పాల్గొన్నారు.
 
 
 
>
మరిన్ని వార్తలు