కొనసాగుతున్న హాకీ క్రీడలు | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న హాకీ క్రీడలు

Published Sat, Sep 3 2016 10:04 PM

కొనసాగుతున్న హాకీ క్రీడలు - Sakshi

నల్లగొండ రూరల్‌ : రాష్ట్ర స్థాయి జూనియర్‌ బాలికల క్రీడలను రెండో రోజైన శనివారం పద్మశ్రీ అవార్డు గ్రహిత ముఖేష్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం మాట్లాడారు. క్రీడల సందర్భంగా మహబూబ్‌నగర్‌ జట్టు వరంగల్‌పై 1–0 ఆధిక్యంతో విజయం సాధించింది. నల్లగొండ జట్టు మెదక్‌పై 2–0, హైదరాబాద్‌ జట్టు ఖమ్మంపై 7–0, రంగారెడ్డి జట్టు నిజామాబాద్‌పై 2–1 ఆధిక్యంతో విజయం సాధించాయి. కార్యక్రమంలో హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిన వెంకటరెడ్డి, డీఎస్‌డీఓ మక్బూల్‌ అహ్మద్, కరీం, పి.కృష్ణమూర్తిగౌడ్, శ్రీనివాస్, రవీందర్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement