క్రీడాకారిణులకు అభినందన

18 Sep, 2016 01:28 IST|Sakshi
క్రీడాకారిణులకు అభినందన
నెల్లూరు(బృందావనం): జాతీయ, అంతర్జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించిన నెల్లూరు క్రీడాకారిణులు ఏకాంబరం జోష్ణవి, కొమ్మెర్ల తులసిను శాప్‌డైరెక్టర్‌ రవీంద్రబాబు, డీఎస్‌డీఓ రమణయ్య శనివారం అభినందించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు మాట్లాడుతూ వియత్నాం రాజధాని హునాయ్‌లో ఈ నెల ఒకటి నుంచి 5వ తేదీ వరకు జరిగిన ఆసియా యోగా క్రీడోత్సవాల్లో జోష్ణవి మూడు బంగారు, ఒక రజత పతకం సాధించినట్లు తెలిపారు. అలాగే ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జంషెడ్‌పూర్‌లో జరిగిన సీనియర్‌ జాతీయస్థాయి వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్‌ క్రీడాకారిణి తులసి 162 కేజీల డెడ్‌లిఫ్ట్‌ ఈవెంట్‌లో కాంస్యపతకం సాధించినట్లు తెలిపారు.  అలాగే ఇంటర్‌స్టేట్‌ +84 వెయిట్‌ క్యాటగిరిలో 475 కేజీల పవర్‌లిఫ్టింగ్‌లో జాతీయస్థాయిలో రజత పతకం సాధించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఖోఖో క్రీడాకారుడు పీ విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు