భద్రకాళి చెరువు మరమ్మతుకు అదనపు నిధులు మంజూరు

25 Sep, 2016 01:03 IST|Sakshi
వరంగల్‌: భద్రకాళి చెరువు మరమ్మతు పనులకు అదనపు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మిషన్‌ కాకతీయ ఫేజ్‌- 2లో చెరువు మరమ్మతులకు రూ405.10 లక్షలు కేటాయించింది. కాగా అదనంగా పనుల కోసం ఇంజినీర్లు ప్రతిపాదించడంతో రూ.57.70 లక్షలను కేటాయించింది. దీంతో ఈచెరువుకు ఇప్పటిదాకా మొత్తం రూ.4.62 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటికే చేపట్టిన పనుల్లో ఎలాంటి పూడికతీతలు చేపట్టలేదు. ఈ అదనపు నిధులతో ఏయే పనులు చేపడతారనేది వేచి చూడాలి. 
 
మరిన్ని వార్తలు