ఆకట్టుకుంటున్న బసవన్నలు

16 Aug, 2016 22:26 IST|Sakshi
ఆకట్టుకుంటున్న బసవన్నలు
పూర్ణానందంపేట :
పుష్కర యాత్రికులను భవానీ ఘాట్‌ వద్ద డూడూ... బసవన్నలు ఆకట్టుకుంటున్నాయి. స్నానాలు ఆచరించి వచ్చే భక్తులు బసవన్నల వద్ద తమ పిత్రుదేవతలను పొగిడించుకుని వాటికి కానుకలు సమర్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంత యాత్రికులకు పెద్దగా ఆకట్టుకోకపోయినా నగరాల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకుంటున్నాయి. పిండప్రధానాలు చేసిన తరువాత బసవన్నలతో పొగిడిస్తే తమ తాతముత్తతాలు సంతోషిస్తారని భక్తులు విశ్వసిస్తారు. బసవన్నలను వాటి యజమానులు అందంగా ముస్తాబుచేసి ఘాట్‌ల వద్ద భక్తులను ఆకట్టుకునేలా ప్రయత్నం చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు