బాలిక అదృశ్యం

6 Feb, 2017 23:48 IST|Sakshi
బాలిక అదృశ్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీఎస్‌పీ బెటాలియన్‌కు చెందిన ఎస్‌.సంధ్యా(13) రోజులుగా కనిపించడం లేదని తల్లిదండ్రులు నాలుగో పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాలుగో తేదీ సాయంత్రం 6.15 గంటలకు ఇంటి నుంచి సైకిల్‌పై వెళ్లిన బాలిక ఆచూకీ ఈ రోజు నుంచి తెలియలేదని, బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి దగ్గర విచారించిన సమాచారం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు నాలుగో పట్టణపోలీసు స్టేషన్‌ సీఐకి (94406 27736, 08518–259462)కు సమాచారం తెలపాలని సూచించారు.   
 
మరిన్ని వార్తలు