గూడెపువలసలో ఉద్రిక్తత

8 Dec, 2015 12:56 IST|Sakshi

విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెపువలస గ్రామంలో మంగళవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్పోర్ట్ భూసేకరణ కోసం సర్వేయర్లు గ్రామంలో ప్రవేశించారు. ఆ విషయాన్ని గమనించి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో సర్వేయర్లతో వారు వాగ్వాదానికి దిగారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని... గ్రామస్తులను సముదాయించేందుకు యత్నించారు.

దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు... పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఈ నేపథ్యంలో ఇద్దరు న్యాయవాదులతోపాటు నలుగురు గ్రామస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.  
 

మరిన్ని వార్తలు