జనవరిలో కొత్త గృహ నిర్మాణాలకు శ్రీకారం

12 Nov, 2016 02:34 IST|Sakshi
తాడేపల్లిగూడెం రూరల్‌ : వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నదని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి, జిల్లా ఇ¯ŒSచార్జ్‌ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. మండలంలోని నీలాద్రిపురంలో రూ.1.13కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, రూ.10లక్షలతో శ్మశాన వాటిక నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి కానుకగా మరో రెండు లక్షల మంది అర్హులైనవారికి తెల్ల కార్డులు అందజేయనున్నట్టు వివరించారు. జిల్లా పరిషత్‌ చైర్మ¯ŒS ముళ్ళపూడి బాపిరాజు మాట్లాడుతూ స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, మున్సిపల్‌ చైర్మ¯ŒS బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీపీ గన్నమని దొరబాబు, ఏఎంసీ చైర్మ¯ŒS పాతూరి రామ్‌ప్రసాద్‌ చౌదరి  తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు