రిఫరీగా లిమ్మేష్‌కుమార్‌

7 Feb, 2017 19:05 IST|Sakshi

కవిటి(ఇచ్ఛాపురం): మండలంలోని పెద్దమెళియాపుట్టుగ జెడ్పీ ఉన్నత పాఠశాల పీఈటీ లిమ్మేష్‌కుమార్‌ పండా ఈ నెల ఎనిమిది నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రం బెల్లంపల్లిలో జరగనున్న 62వ జూనియర్స్‌ జాతీయస్థాయి బాల్‌బ్యాడ్మింటన్‌ పోటీలకు రిఫరీగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయన సమాచారం వచ్చింది. పలుమార్లు రిఫరీగా ఎంపికైన తనకు మరోసారి అవకాశం లభించడంపై కవిటి పంచాయతీ సర్పంచ్‌ పాండవ చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు