రాయదుర్గం రూరల్ : రాయదుర్గం రూరల్ మండలం కదరంపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ను బుధవారం అరెస్టు చేసినట్లు స్థానిక సీఐ చలపతి తెలిపారు. ఈ నెల ఒకటిన ఆటోను లారీ ఢీకొని ఐదుగురు మరణించగా, 13 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఘటనకు కారకుడైన ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన లారీ డ్రైవర్ కాసాని సుబ్బారావును అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచినట్లు వివరించారు.