డైట్‌లో ఎల్పీ సెట్‌ కౌన్సెలింగ్‌

26 Jul, 2016 23:33 IST|Sakshi
డైట్‌లో ఎల్పీసెట్‌ అభ్యర్దులకు కౌన్సెలింగ్‌ చేస్తున్న ఇన్‌చార్జీ ప్రిన్సిఫాల్‌ సాయి ప్రసాద్‌
 
కార్వేటినగరం : ఎల్పీ సెట్‌ తెలుగు, హిందీ పండిట్‌లకు మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా విద్యా శిక్షణ  సంస్థ (డైట్‌)లో   ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ సాయిప్రసాద్‌ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో తెలుగు పండిట్‌ కోర్సులకు కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో 50 సీట్లు ఉన్నాయన్నారు. హిందీ పండిట్‌ కోర్సులకు జిల్లాలో 250 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం తెలుగుకు 23 మంది, హిందీకి 11 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారని తెలిపారు. సర్టిఫికెట్లు,  అలాట్‌మెంట్‌ కాపీలను పరిశీలించి, మీసేవా కేంద్రంలో రుసుం చెల్లించిన అభ్యర్థులకు సీట్ల కేటాయింపు కాపీని అందించినట్లు చెప్పారు. కౌన్సెలింగ్‌లో అధ్యాపకులు డాక్టర్‌ గంగిరెడ్డి, ఉమాశంకర్, సుధీర్, అయ్యప్ప, సూపరింటెండెంట్‌ ఆండాలు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు