పాముకాటుకు మేకల కాపరి బలి

13 Aug, 2016 22:05 IST|Sakshi
పాముకాటుకు మేకల కాపరి బలి
అర్ధవీడు : పాముకాటుతో పరిస్థితి విషమించి మేకల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొత్తూరులో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గుమ్మా ఆవులయ్య(48) మేకలు తోలుకొని కొండకు వెళ్లాడు. పొదల్లో ఉన్న పాము కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు వచ్చి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు.
 
మృతునికి భార్య, నలుగురు కుమార్తెలున్నారు. ఆవులయ్య మృతదేహాన్ని ఇన్‌చార్జి తహసీల్దార్‌ విజయలక్ష్మి పరిశీలించారు. మృతుని కుటుం బాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపుతానని హామీ ఇచ్చారు. తహసీల్దార్‌తో పాటు ఆర్‌ఐ గంగిరెడ్డి, అయ్యవారిపల్లె సర్పంచి బాలరంగాచారి, ఎంపీటీసీ సభ్యుడు యూసుఫ్‌వలి ఉన్నారు. 
మరిన్ని వార్తలు