వరికోత మిషన్‌లో పడి వ్యక్తి మృతి

24 Oct, 2016 16:43 IST|Sakshi

దుగ్గొండి(వరంగల్): వరికోత మిషన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా దుంగ్గొండి మండలం లక్ష్మీపురంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తాల్లపల్లి సాంబయ్య(38) వరికోత మిషన్ సమీపంలో నిల్చొని ఉన్న సమయంలో అతన్ని గుర్తించని మిషన్ డ్రైవర్ అతని పై నుంచి మిషన్‌ను పోనిచ్చాడు. దీంతో అందులో పడ్డ సాంబయ్య అక్కడికక్కడే మృతిచెందాడు.
 

మరిన్ని వార్తలు