నాగార్జునకొండలో మయన్మార్‌ బౌద్ధులు

20 Oct, 2016 21:17 IST|Sakshi
నాగార్జునకొండలో మయన్మార్‌ బౌద్ధులు
విజయపురి సౌత్‌: నాగార్జునకొండను గురువారం మయన్మార్‌ దేశానికి చెందిన 8 మంది బౌద్ధుల బృందం సందర్శించింది. వీరు కొండపై నెలకొల్పిన మ్యూజియంలోని పురాతన శిలాఫలకాలను, లోహపు పాత్రలను, బుద్ధుని కాలం నాటి పాలరాతి విగ్రహాన్ని ఆసక్తిగా తిలకించారు. మ్యూజియంలో రాతిబండలపై చెక్కిన  వివిధ కళారూపాలను వీక్షించారు. కొండపై దలైలామా నాటిన బోధిమొక్క వద్ద ప్రార్థన చేశారు. తరువాత పునర్నిర్మిత మహా స్థూపం, స్నానఘట్టం, ఆశ్వమేధ యజ్ఞశాలను సందర్శించారు. అనంతరం సాగర్‌ చేరుకొని అనుపు, ఎత్తిపోతల జలపాతాలను వీక్షించారు.
మరిన్ని వార్తలు