గుంటూరు స్పోర్ట్స్ : రాష్ట్రస్థాయి 7వ రైఫిల్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో మహిళల విభాగంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జె.బేబీ మానస విజేతగా నిలిచింది. బ్రాడీపేటలోని ఇండియన్ అకాడమి షూటింగ్ స్పోర్ట్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో మానస ప్రతిభ చూపి పతకం గెలుచుకుంది. పోటీలను విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తిలకించారు. రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సలాలీత్ విజేతలకు పతకాలు అందించారు.