మంత్రి కాన్వాయ్‌కి తప్పిన ప్రమాదం

3 Aug, 2016 11:46 IST|Sakshi

కరీంనగర్: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్‌కి బుధవారం తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఓ వాహన డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేయడంతో వెనకున్న టీఆర్‌ఎస్ నాయకుల వాహనాలు ఒకదానివెంట మరొకటి వరసగా ఢీకొన్నాయి. దీంతో సదరు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి ఈటల రాజేందర్ బుధవారం మెట్‌పల్లి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్తున్నప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
 

మరిన్ని వార్తలు