జనారణ్యంలోకి జాతీయ పక్షి

2 Mar, 2017 21:11 IST|Sakshi
జనారణ్యంలోకి జాతీయ పక్షి

అప్పుడే ఎండలు మండుతున్నాయి. భూగర్భ జలాలు అడుగుంటాయి. తాగునీటి కోసం జనమే కాదు.. వన్యప్రాణులు సైతం విలవిల్లాడిపోతున్నాయి. దాహార్తిని తీర్చుకునేందుకు అడవులు వదిలి జనారణ్యంలోకి వన్యప్రాణులు వచ్చేస్తున్నాయి. అందుకు మడకశిర మండలం ఆదిరెడ్డిపాళ్యం సమీపంలోని ప్రధాన రహదారిపైకి ఓ నెమలి ఒయ్యారంగా నడుచుకుంటూ వచ్చిన దృశ్యం ఆ మార్గంలో రాకపోకలు సాగించిన వారందరినీ గురువారం ఆకట్టుకుంది. కాసేపటికి అక్కడే ఉన్న కోళ్ల మధ్యలోకి చేరుకుంది. వన్యప్రాణులకు మేత, నీరు ఏర్పాటు చేయాలని స్థానికులు అటవీ అధికారులను కోరారు.
- మడకశిర రూరల్‌

మరిన్ని వార్తలు