నవ వధూవరుల ఆత్మహత్యాయత్నం.. వధువు మృతి

11 Mar, 2015 09:24 IST|Sakshi

అనంతపురం(తాడెపత్రి): పెళ్లి అయి మూడు రోజుల కూడా కాకుండానే నూతన వధూవరులు ఆత్మహత్యకు ప్రయత్నించడం స్థానికంగా కలకలం రేపింది. గొంతుకోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన జంటలో వ ధువు మృతిచెందగా వరుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రి లోని నంద్యాల రోడ్డు కాలనీలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. తాడిపత్రికి చెందిన పకీరప్ప(25)కు అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మి(20)తో ఈ నెల 8న వివాహమైంది. అయిత బుధ వారం నూతన వధూవరులు ఎంతకీ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసిన కుటుంబ సభ్యులకు రక్తపు మడుగులో పడిఉన్న జంట కనిపించింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా అప్పటికే నూతన వధువు విజయలక్ష్మి చనిపోగా.. వరుడు పకీరప్ప పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. నూతన వధూవరులు తీసుకున్న నిర్ణయంతో వారి బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.

 

>
మరిన్ని వార్తలు