తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

7 Jun, 2016 08:32 IST|Sakshi

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు మూడు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. సోమవారం స్వామివారిని 82,347 మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు వివరించారు.
 

>
మరిన్ని వార్తలు