తిరుమల జపాలి తీర్థంలో పాకిస్థాన్ జెండా?

16 May, 2016 13:51 IST|Sakshi
తిరుమల జపాలి తీర్థంలో పాకిస్థాన్ జెండా?

తిరుమల: పాపనాశనం వెళ్లే మార్గంలో ఉన్న జపాలి తీర్థంలో గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్ జెండాను వదిలి వెళ్లినట్టు తెలుస్తోంది. నెలవంక, నక్షత్రం గుర్తుతో తెలుపు రంగులో ఉన్న జెండాను సోమవారం ఉదయం జపాలి తీర్థం వద్ద భక్తులు గమనించారు. ఆ విషయాన్ని భక్తులు టీటీడీ విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు జపాలి తీర్థం వద్దకు వెళ్లి ఆ జెండాను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉరుసు ఉత్సవాల్లో దర్గాలవద్ద కట్టే జెండానా?.. లేక పాకిస్థాన్ జెండానా?.. అని విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు