రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదయ్యా

15 Feb, 2018 06:41 IST|Sakshi

జలదంకి: ‘అయ్యా.. కూలి పనులకు వెళితే కానీ పూట గడవని పరిస్థితి మాది. నెలా నెలా ప్రభుత్వం నుంచి రేషన్‌ సరిగా అందితేనే మూడు పూటలా భోజనం. అయితే, వేలి ముద్ర సరిగా పడడం లేదని రేషన్‌ సరుకులు ఇవ్వడం లేదు’ అంటూ కలిగిరి మండలం చిన్న అన్నలూరుకు చెందిన వర్ధినేని రాములమ్మ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదుట వాపోయింది. కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న తనకు చేతి వేళ్లు సక్రమంగా లేవని చెబుతున్నా డీలర్‌ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మనందరి ప్రభుత్వం రాగానే ఇలాంటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని జననేత ఆమెకు ధైర్యం చెప్పారు.

మరిన్ని వార్తలు